రక్తంతో సీఎం కేసీఆర్‌కు లేఖ | mohammad muzahid hussain letter with blood to cm kcr | Sakshi
Sakshi News home page

రక్తంతో సీఎం కేసీఆర్‌కు లేఖ

Jul 17 2017 7:53 AM | Updated on Aug 15 2018 9:40 PM

రక్తంతో సీఎం కేసీఆర్‌కు లేఖ - Sakshi

రక్తంతో సీఎం కేసీఆర్‌కు లేఖ

రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మహ్మద్‌ ముజాహిద్‌ హుస్సేన్‌ రక్తంతో తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు.

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖను జీఎస్టీకి అనుగుణంగా పునర్‌ వ్యవస్థీకరించాలని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మహ్మద్‌ ముజాహిద్‌ హుస్సేన్‌ రక్తంతో తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. ఆదివారం హైదరాబాద్‌లో లేఖ పత్రులను పత్రికలకు ఆయన విడుదల చేశారు.

కేంద్ర ప్రభుత్వం జూలై ఒకటిన ఒకే దేశం ఒకే పన్ను (జీఎస్టీ) ఒకే మార్కెట్‌ విధానాన్ని ప్రవేశపెట్టడాన్ని స్వాగతిస్తూనే దానికి అనుగుణంగా రాష్ట్ర పన్నుల శాఖ కూడా రీ–ఆర్గనైజేషన్‌ కావాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. పునర్‌ వ్యవస్థీకరణతోనే రాష్ట్ర పన్నుల శాఖ బలోపేతం అవుతుందన్నారు. తక్షణమే ప్రభుత్వం చర్యలు చేపట్టే విధంగా ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement