అనాథ యువతికి అన్నీ తామై.. | Minister Malla Reddy Helps Orphan Young Women For Marriage | Sakshi
Sakshi News home page

అనాథ యువతికి అన్నీ తామై..

Jun 24 2019 7:56 AM | Updated on Jun 24 2019 8:04 AM

Minister Malla Reddy Helps Orphan Young Women For Marriage - Sakshi

కన్యాదానం చేసిన మంత్రి మల్లారెడ్డి దంపతులు

మేడ్చల్‌: అనాథాశ్రమంలో పెరిగిన యువతికి మంత్రి మల్లారెడ్డి అన్నీ తానయ్యారు. తండ్రి సా ్థనం వహించి వివాహం చేశారు. గుండ్లపోచంపల్లి  మున్సిపల్‌ పరిధిలోని గౌరీ ఆశ్రమానికి చెందిన అనాథ యువతి పుష్పకు, విజయవాడకు చెందిన కిషోర్‌తో ఆదివారం వివాహమైంది. మంత్రి మల్లారెడ్డి ఆయన సతీమణి కల్పనారెడ్డి కన్యాదానం చేశారు. పుష్ప పేరిట రూ.2.5  లక్షలు డిపాజిట్‌ చేయించారు. పెళ్లి ఖర్చుల నిమిత్తం రూ.25 వేల నగదు అందజేశారు. నూతన వధూవరులను మంత్రి దంపతులు ఆశీర్వదించారు.

Advertisement
 
Advertisement
Advertisement