భాగ్యనగర్కాలనీ: వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ కుమారుడు మరణించాడని మృతుడి తల్లితో పాటు కుటుంబ సభ్యులు గురువారం ఓ ప్రైవేట్ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వివరాలు ఇలా ఉన్నాయి.. కర్నూలు జిల్లాకు చెందిన శ్రీనివాసరెడ్డి (32) చింతల్లో నివాసముంటూ కూకట్పల్లిలోని హోండా షోరూమ్లో ఉద్యోగం చేస్తున్నాడు. బుధవారం సాయంత్రం విధుల్లో ఉండగా కడుపు నొప్పి వచ్చింది. దీంతో శ్రీనివాసరెడ్డిని తోటి ఉద్యోగులు సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మృతి చెందాడని డాక్టర్లు చెప్పారు. శ్రీనివాసరెడ్డి మరణానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని మృతుడి కుటుంబసభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న కూకట్పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతుడి తల్లి ఈశ్వరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా కేసు దర్యాప్తు చేపడతామని పేర్కొన్నారు.
కడుపు నొప్పితో వస్తే కాటికి పంపారు
Published Fri, Aug 24 2018 7:55 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement