మంత్రి మల్లారెడ్డికి చేదు అనుభవం 

Malla Reddy Blackout By People In Rangareddy District - Sakshi

సొంత ఇలాకాలో మంత్రిని అడ్డుకున్న స్థానికులు 

సాక్షి, మేడ్చల్‌: కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డికి తన సొంత ఇలాకాలో బుధవారం చేదు అనుభవం ఎదురైంది. మంత్రి పుట్టిపెరిగిన ఊరు, మంత్రికి చెందిన ఇంజనీరింగ్‌ కాలేజీల సామ్రాజ్యంతో నిండిపోయిన మైసమ్మగూడలో మంత్రి మల్లారెడ్డిని స్థానిక మహిళలు అడ్డుకున్నారు. వివరాల్లోకెళ్తే... గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో బుధవారం మంత్రి మల్లారెడ్డి పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు హాజరయ్యారు. అనంతరం మైసమ్మగూడలోని సీసీ రోడ్డు పనులను ప్రారంభించేందుకు వస్తున్న మంత్రి కాన్వాయ్‌ని స్థానిక మహిళలు అడ్డుకున్నారు. తమ కాలనీలో కొన్ని సంవత్సరాలుగా పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించాలని మహిళలు డిమాండ్‌ చేశారు. దీంతో కంగు తిన్న మంత్రి మల్లారెడ్డి కాలనీలో పర్యటించి సమస్యలు తెలసుకున్నారు. గ్రామంలోని కాలనీల్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించి, సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణంతో పాటు తాగు నీటి సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించడంతో మహిళలు ఆందోళన విరమించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top