ప్రచారంలో ఎదురుపడి.. | Madhira Assembly Constituency Candidates Canvass | Sakshi
Sakshi News home page

ప్రచారంలో ఎదురుపడి..

Nov 24 2018 11:35 AM | Updated on Nov 24 2018 11:35 AM

Madhira Assembly Constituency Candidates Canvass - Sakshi

సాక్షి, మధిర: మధిర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూటమి(కాంగ్రెస్‌) తరఫున మల్లు భట్టి విక్రమార్క, టీఆర్‌ఎస్‌ నుంచి లింగాల కమల్‌రాజ్‌ ప్రధా న పార్టీల అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. మధిర నగరపంచాయతీ పరిధిలోని 17వ వార్డులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కమల్‌రాజ్‌తోపాటు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు.. అదే సమయంలో, అదే వార్డు లో కాంగ్రెస్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు కలిసి భట్టి తనయుడు మల్లు సూర్యవిక్రమాదిత్య ను వెంటబెట్టుకుని ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో ఇరువర్గాల వాహనాలు ఎదురెదురుగా వచ్చాయి. ఎదురైన వాహనాలు తప్పుకునేటప్పుడు, కార్యకర్తలు ఒకే చోటకు చేరినప్పుడు ఏమైనా వివాదం జరుగుతుందేమోనని ఒకింత ఆందోళన నెలకొంది. అయితే ఎవరికివారే ప్రశాతంగా ప్రచా రం నిర్వహించుకున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement