సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కృత్రిమంగా ఎరువుల కొరత సృష్టించే దుకాణాల యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని, వారి లెసైన్సులు రద్దుచేస్తామని వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హెచ్చరించారు. ప్రస్తుత సీజన్లో ఎరువుల కృత్రిమ కొరత సృష్టించడమే కాకుండా ఎక్కువ ధరలకు యూరి యాను విక్రయిస్తున్నారని ‘సాక్షి’ ప్రచురించిన కథనంపై ఆయన శనివారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ స్పందించారు. రాష్ట్రంలో ఎక్కడా యూరియా, కాంప్లెక్స్ ఎరువుల కొరత లేదని.. అయితే కొంతమంది దుకాణ యజమానులు కావాలని కొరత సృష్టించి రైతులకు ఎక్కువ ధరకు అమ్ముతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు.
ఎరువుల విషయంలో కృత్రిమ కొరత సృష్టించినా, ఎక్కువ ధరకు అమ్మినా లెసైన్సుదారులతో పాటు వ్యవసాయశాఖ ఏడీ, ఏఓలనూ సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. రైతులెవరైనా ఎరువులు కొన్నాక ఎక్కువ ధరకు విక్రయించారని అనిపిస్తే ఆ బిల్లులతో సహా వచ్చి ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని సూచించారు. అందుకోసం రెండు టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేశామన్నారు. ఒకటి గుంటూరులో 1832216644, మరొకటి వ్యవసాయశాఖ పరిధిలో కిసాన్ కాల్ సెంటర్ 18001801551 నంబర్లు ఉంటాయని తెలి పారు. రాష్ట్రంలో 7.58 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం ఉంటే, ఇప్పటికే 5.88 లక్షల మెట్రిక్ టన్నులు ఇచ్చామన్నారు. మరో 1.88 మెట్రిక్ టన్నుల ఎరువులకు కేంద్రం డెలివరీ అనుమతి కూడా ఇచ్చిందన్నారు. ఈ ఏడాది సాగుబడి ఏ మాత్రం తగ్గలేదని, గతేడాది 35.92 లక్షల హెక్టార్లలో జరిగిందని, ఈ ఖరీఫ్ సీజన్లోనూ అంతే స్థాయిలో సాగవుతోందని చెప్పారు. రానున్న రబీకి కూడా విత్తనాలు, ఎరువులు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
తొలి దశలో రూ. 50 వేలైనా మాఫీ
ఇదిలావుంటే.. రైతుల రుణ మాఫీకి సంబంధించి తొలి దశలో కనీసం రూ. 50 వేలైనా మాఫీ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మంత్రి ప్రత్తిపాటి పేర్కొన్నారు. లక్షన్నర రూపాయల ప్రాతిపదికన రాష్ట్రంలో రూ. 42 వేల కోట్ల రుణాలు మాఫీ చేయాల్సి ఉందని.. అయితే రూ. 50 వేల లోపు రుణాలున్న వారే 40శాతం మంది రైతులు ఉన్నారని ఆయన చెప్పారు. రైతుల ఖాతాల్లో రూ. 50 వేలు జమ చేయడం ద్వారా వారికి కొంతవరకైనా వెసులుబాటు కలుగుతుందన్నారు. మిగతా సొమ్మును మరో రెండు దఫాల్లో చెల్లించే అంశాన్ని పరిశీలిస్తున్నామని మంత్రి చెప్పారు. బ్యాంకులు రుణ మాఫీకి సంబంధించి వివరాలు సేకరించడంలో జాప్యం జరుగుతోందని, వీలైనంత త్వరలో వివరాలివ్వాలని ఆదేశించామన్నారు. రైతుల రుణ మాఫీకి ఒక కార్పొరేషన్ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.
ఎరువుల కొరత సృష్టిస్తే లెసైన్సుల రద్దు: ప్రత్తిపాటి
Published Sun, Sep 21 2014 3:47 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement