ఐలయ్య వ్యాఖ్యలు: ఖమ్మం బంద్
ఖమ్మం: కంచె ఐలయ్య ఆర్య వైశ్యులను కించపర్చారని నిరసిస్తూ వ్యాపారులు బుధవారం ఖమ్మం బంద్ పాటిస్తున్నారు. గాంధీ చౌక్ నుండి నగరంలోని అన్ని ప్రధాన వీధుల్లో నిరసన ర్యాలీ చేపట్టారు. వైశ్యుల ర్యాలీకి ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు మద్దతు తెలిపారు. స్వయంగా బుల్లెట్ నడుపుతూ వైశ్యులతో కలిసి ఎమ్మెల్యే అజయ్ కుమార్ ర్యాలీలో పాల్గొన్నారు.