పరిమితికి మించి ఖర్చు చేస్తున్న పార్టీలపై ఏం చర్యలు తీసుకున్నారు? | High court orders to take actions on spending more money for parties | Sakshi
Sakshi News home page

పరిమితికి మించి ఖర్చు చేస్తున్న పార్టీలపై ఏం చర్యలు తీసుకున్నారు?

Dec 9 2014 2:39 AM | Updated on Sep 17 2018 5:36 PM

ఎన్నికల్లో నిర్దేశించిన దాని కంటే అధిక మొత్తాలు ఖర్చు చేస్తున్న రాజకీయ పార్టీలపై ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారో, ఇకపై ఏం చర్యలు తీసుకుంటారో వివరించాలని హైకోర్టు సోమవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.

పూర్తి వివరాలను కోర్టు ముందుంచండి
కేంద్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశం

 
 సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో నిర్దేశించిన దాని కంటే అధిక మొత్తాలు ఖర్చు చేస్తున్న రాజకీయ పార్టీలపై ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారో, ఇకపై ఏం చర్యలు తీసుకుంటారో వివరించాలని హైకోర్టు సోమవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈ విషయంలో రాజకీయ పార్టీల అభిప్రాయాలు తెలుసుకోవాలని, అసలు దేశంలో ఎన్ని గుర్తింపు పొందిన, రిజిస్టర్ అయిన పార్టీలు ఉన్నాయో కూడా తెలియజేయాలని ఎన్నికల సంఘానికి స్పష్టం చేసింది.
 
ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలతో నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ పార్టీలు ఎన్నికల్లో అధిక మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తున్నాయని, ఈ విషయంలో కొత్త నిబంధనలను రూపొందించేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన కింగ్‌షుక్ నాగ్ అనే వ్యక్తి హైకోర్టుకు లేఖ రాశారు. దీన్ని పరిశీలించిన హైకోర్టు.. పిల్‌గా పరిగణించి హైకోర్టు విచారించింది.  

Advertisement
 
Advertisement
Advertisement