పరిగి అభివృద్ధికి నిధులివ్వండి 

Give Funding To Parigi Development - Sakshi

పరిగి వికారాబాద్‌ : నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని టీఆర్‌ఎస్‌ పొలిట్‌బ్యూరో సభ్యుడు , మాజీ ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్‌రెడ్డి మంత్రి కేటీఆర్‌ను కోరారు. ఈమేరకు బుధవారం ఆయన ఐటీశాఖ మంత్రిని హైదరాబాద్‌లోని నివాసంలో కలిసి పలు అంశాలు చర్చించారు.

పరిగి నియోజకవర్గ పరిధిలోని ఆయా మండలాల్లోని పలు సమస్యలను మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. ఇందుకోసం అవసరమైన నిధులు కేటాయించాలని కోరినట్లు చెప్పారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించారని, నిధుల కేటాయింపుకు హామీ ఇచ్చారని హరీశ్వర్‌రెడ్డి తెలిపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top