
సాక్షి, కరీంనగర్ : అన్ని పార్టీలు ఏకమై వచ్చినా హుజూర్నగర్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపును ఆపలేకపోయారని పౌర సరఫరా, సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యానించారు. రామడుగు మండలం గోపాల్రావు పేట మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకరణకు మంత్రి హాజరైయ్యారు. మంత్రి మాట్లాడుతూ.. ఉద్యమ కారులకు టీఆర్ఎస్ పార్టీ పదవులు ఇచ్చి గౌరవం ఇస్తుందని, బడుగు బలహీన వర్గాలకు పెద్ద పీట వేస్తుందని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ది కాదని.. తెలంగాణ ప్రజలదని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీకి ఓనర్ ఎవరూ లేరని.. ప్రజలే ఓనర్లని అన్నారు.