అప్పులబాధతో రైతు ఆత్మహత్య | former commits suicide over debts crisis in adilabad district | Sakshi
Sakshi News home page

అప్పులబాధతో రైతు ఆత్మహత్య

Oct 11 2015 3:40 PM | Updated on Sep 3 2017 10:47 AM

భీమిని మండలం గజ్జరవెల్లిలో శనివారం రాత్రి 8 గంటల సమయంలో కోట్రంగి దేవయ్య(35) అనే రైతుపురుగులమందు తాగి

ఆదిలాబాద్(భీమిని): భీమిని మండలం గజ్జరవెల్లిలో శనివారం రాత్రి 8 గంటల సమయంలో కోట్రంగి దేవయ్య(35) అనే రైతుపురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబసభ్యులు హుటాహుటిన చికిత్స నిమిత్తం బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. దేవయ్య చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు.

సహకార బ్యాంకులో రూ.40వేలు, ప్రైవేటుగా రూ. 2లక్షలు అప్పు ఉన్నట్లు, అదీ గాక వేసిన పంట సరిగా పండకపోవడంతో మనస్తాపం చెంది దేవయ్య ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement