రబీ పంటల సాగుకు కడెం ప్రాజెక్టు నీటిని విడుదల చేయాలని కోరుతూ రైతులు ఆందోళనకు దిగారు.
లక్సెట్టిపేట్: రబీ పంటల సాగుకు కడెం ప్రాజెక్టు నీటిని విడుదల చేయాలని కోరుతూ రైతులు ఆందోళనకు దిగారు. ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేట పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మండలానికి చెందిన దాదాపు 50 మంది రైతులు రాస్తారోకో చేశారు. గురువారం మధ్యాహ్నం నిరసన సాగటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళన విరమింపజేశారు. ట్రాఫిక్ ను పునరుద్ధరించారు.