‘కడెం’నీటి కోసం ఆందోళన | farmers dharna for release of water | Sakshi
Sakshi News home page

‘కడెం’నీటి కోసం ఆందోళన

Nov 12 2015 2:12 PM | Updated on Jun 4 2019 5:16 PM

రబీ పంటల సాగుకు కడెం ప్రాజెక్టు నీటిని విడుదల చేయాలని కోరుతూ రైతులు ఆందోళనకు దిగారు.

లక్సెట్టిపేట్: రబీ పంటల సాగుకు కడెం ప్రాజెక్టు నీటిని విడుదల చేయాలని కోరుతూ రైతులు ఆందోళనకు దిగారు. ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేట పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మండలానికి చెందిన దాదాపు 50 మంది రైతులు రాస్తారోకో చేశారు. గురువారం మధ్యాహ్నం నిరసన సాగటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళన విరమింపజేశారు. ట్రాఫిక్ ను పునరుద్ధరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement