లాభదాయకమా కాదా? | Explanation the appointment of the gutta | Sakshi
Sakshi News home page

లాభదాయకమా కాదా?

Apr 11 2018 2:33 AM | Updated on Apr 11 2018 2:33 AM

Explanation the appointment of the gutta - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన గుత్తా సుఖేందర్‌రెడ్డి నియామకం చెల్లుతుందా అనే విషయం చర్చనీయాంశమైంది. నల్లగొండ ఎంపీగా ఉన్న గుత్తాకు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ఈ బాధ్యతలను అప్పగించింది. ఎంపీ పదవిలో ఉన్న గుత్తా లాభదాయకమైన మరో పదవిలో ఎలా కొనసాగుతారంటూ రాష్ట్ర బీజేపీ నేతలు ఇటీవలే లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.

దీంతో ఆ వివరాలు పంపాలని లోక్‌సభ కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణ కోరినట్లు సమాచారం. ఈ మేరకు సీఎస్‌కు  లేఖ రాసినట్లు తెలిసింది.  దీనిపై లోక్‌సభకు సమాధానం పంపించేందుకు అధికారులు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. ఈ వ్యవహారానికి సంబం ధించి లోక్‌సభకు ఉత్తర ప్రత్యుత్తరాల బాధ్యతలను సీనియర్‌ ఐఏఎస్, ప్రధాన కార్యదర్శి శాలిని మిశ్రాకు సీఎస్‌ ఎస్‌కే జోషి అప్పగించినట్లు తెలిసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement