ఓటును నిర్భయంగా వినియోగించుకోవాలి

Everybody Should Use The Voting Right - Sakshi

తిర్యాణి: ప్రజలు తమ ఓటు హక్కును ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా నిర్భయంగా విని యోగించుకోవాలని ఆసిఫాబాద్‌ డీఎస్పీ సత్యనారాయణ అన్నారు. ఆదివారం మండలకేంద్రం లో ఎన్నికలపై అవగాహన కోసం కేంద్ర బలగాలు  పోలీసులతో వీధుల్లో కవాతు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా తమ ఓటును వినియోగించుకోవాలన్నారు. ఓటు గురించి బలవంతపెడితే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. ఓటును స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని, రాజకీయ నాయకులు పోలీస్‌ శాఖ అనుమతి పొంది ప్రచారాలు చేసుకోవాలన్నారు. యాక్షన్‌ టీం సభ్యుల ఫొటోలతో కూడిన పోస్టర్లను విడుదల చేశారు. అనుమానిత వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు అందించాలన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top