హన్మకొండలోని అదాలత్ ప్రాం తంలో జరిగిన పిల్లల డాక్టర్ సురేందర్రెడ్డి కిడ్నాప్ కేసులో మరో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
భీమారం : హన్మకొండలోని అదాలత్ ప్రాం తంలో జరిగిన పిల్లల డాక్టర్ సురేందర్రెడ్డి కిడ్నాప్ కేసులో మరో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో కిడ్నాపర్లు 40 నిమిషాల్లోనే రూ.21 లక్షలు డిమాండ్ చేసి రాబట్టుకున్నారు. ఈ ఘటనలో హన్మకొండకు చెందిన ఉతకం దీపక్, గోకుల్నగర్కు చెందిన కొడారి రాజు, కాజీపేటకు చెందిన నాగెల్లి సంతోష్, వర్ధన్నపేటకు చెందిన వడ్లకొండ హరీన్ పాల్గొనగా వీరిలో దీపక్, సంతోష్ను ఇటీవల అరెస్ట్ చేసి, జైలుకు పంపిన విషయం తెలిసిందే.
పరారీలో ఉన్న హరీన్, కొడారి రాజు కోసం గాలిస్తుండగా హరీన్ సోమవారం పోలీసులకు చిక్కాడు. అతడి వద్ద సుమారు రూ.1.20 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అతడు ప్రస్తుతం ఉతకం దీపక్కు కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడని హన్మకొండ డీఎస్పీ దక్షిణామూర్తి చెప్పారు. ఈ కేసులో మరో నిం దితుడు కొడారి రాజు పరారీలో ఉన్నట్లు ఆయ న తెలిపారు. అతడి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు వివరించారు. వ్యక్తిగత అవసరాల కోసమే డాక్టర్ను కిడ్నాప్ చేశారని తమ విచారణలో వెల్లడైనట్లు ఆయన వెల్లడిం చారు. విలేకరుల సమావేశంలో సీఐ దేవేందర్రెడ్డి, కానిస్టేబుల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.