'కళంకిత మంత్రులను వెంటనే తొలగించాలి' | Congress Stage rasta roko | Sakshi
Sakshi News home page

'కళంకిత మంత్రులను వెంటనే తొలగించాలి'

Jul 10 2015 4:25 PM | Updated on Sep 4 2018 5:16 PM

'కళంకిత మంత్రులను వెంటనే తొలగించాలి' - Sakshi

'కళంకిత మంత్రులను వెంటనే తొలగించాలి'

కేంద్ర ప్రభుత్వ మంత్రి వర్గంలో ఉన్న కళంకిత మంత్రులను వెంటనే తొలగించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగింది.

ఎల్బీనగర్ (హైదరాబాద్) : కేంద్ర ప్రభుత్వ మంత్రి వర్గంలో ఉన్న కళంకిత మంత్రులను వెంటనే తొలగించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగింది. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్ ఎల్బీనగర్ చింతల్‌కుంటలో జాతీయ రహదారి-65 పై రాస్తోరోకో నిర్వహించారు. కళంకిత మంత్రులు వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రుల దిష్టిబొమ్మలను రోడ్డుపై దహనం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డితోపాటు పలువురు కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలు పాల్గొన్నారు. జాతీయరహదారిపై రాస్తోరోకోకు దిగడంతో భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement