కాంగ్రెస్ సభ్యత్వ నమోదు సమీక్షలో నిర్ణయం
మైనార్టీ సమ్మేళనం తరహాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సమ్మేళనాలు
2015లోగా సభ్యత్వం పూర్తి
భేటీలో పాల్వాయి గోవర్ధన్రెడ్డి, రాజగోపాల్రెడ్డి మధ్య వాగ్వాదం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పార్టీ బలోపేతానికి మరిన్ని సదస్సులు నిర్వహించాలని కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయించింది. మైనారిటీ సమ్మేళనం తరహాలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ సమ్మేళనాలు జరపాలని, 2015లోగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేయాలని నేతలు నిర్ణయించారు. ప్రస్తుతం జరుగుతున్న సభ్యత్వ నమోదును ఏఐసీసీ, టీపీసీసీ నాయకత్వం ఆదివారం సమీక్షించింది. అన్ని జిల్లాల అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మొన్నటి ఎన్నికల్లో అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల్లో ఓడిపోయిన అభ్యర్థులు ఇందులో పాల్గొన్నారు. టీపీసీసీ చీఫ్ పొన్నాల అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈనెల 28 నుంచి డిసెంబర్ 16 వరకు బ్లాక్, మండల, బూత్ స్థాయిలో సభ్యత్వ నమోదు చేపట్టాలని నిర్ణయించారు. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ జన్మదినమైన డిసెంబర్ 9న రాష్ట్రవ్యాప్తంగా బూత్స్థాయి వరకు పెద్ద ఎత్తున సభ్యత్వాలు నమోదు చేయించాలని, ఏ స్థాయి నేత అయినా తమ బూత్లో ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పార్టీ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ సూచించారు.
పాల్వాయి వర్సెస్ రాజగోపాల్రెడ్డి
సభ్యత్వ పుస్తకాలు ఎవరికి ఇవ్వాలన్న అంశంపై మరోసారి వివాదం చెలరేగింది. సమీక్షలో పలువురు నేతలు తమ జిల్లాలో సభ్యత్వ నమోదు గురించి వివరిస్తుండగా.. నల్లగొండ జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్రెడ్డి, భువనగిరి మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మధ్య వాగ్వాదం జరిగినట్టు తెలిసింది. పాల్వాయి మాట్లాడుతుండగా రాజగోపాల్రెడ్డి అడ్డుపడుతూ.. ‘‘ఒక ఎంపీ అయి ఉండీ తన కూతురును రె బల్గా పోటీకి పెట్టించి అభ్యర్థుల ఓటమి కార ణమయ్యారు. అలాంటి వారికి సభ్యత్వ పుస్తకాలు ఎలా ఇస్తారు?’’ అని నిలదీసినట్లు సమాచారం. సమావేశం నుంచి బయటకు వచ్చాక కూడా వీరిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సమీక్ష సమావేశానికి హాజరైన రాజ్యసభ సభ్యుడు ఆనంద భాస్కర్ సైతం ఎవరికి ఎలాంటి గుర్తింపు ఇస్తున్నారంటూ ఆగ్రహంగా భేటీ నుంచి వెళ్లిపోయారు. అభ్యర్థుల ఓటమికి కారణమైన వారికి సభ్యత్వ పుస్తకాలు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వొదన్న డిమాండ్ అత్యధికుల నుంచి వచ్చిందని సమాచారం.
‘పదేళ్ల స్వర్ణయుగం’ బ్రోచర్ విడుదల
పదేళ్ల యూపీఏ పాలనలో ముస్లింలకు జరిగిన మేలు, చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ‘పదేళ్ల స్వర్ణయుగం’ పేరిట రూపొందించిన బ్రోచర్ను సమ్మేళనంలో విడుదల చేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్, కేంద్ర మాజీమంత్రి సల్మాన్ ఖుర్షీద్, మైనారిటీ సెల్ చైర్మన్ ఖుర్షీద్ అహ్మద్, ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పుల రాజు తదితరులుఈ బ్రోచర్ను విడుదల చేశారు.
పార్టీని బలోపేతం చేద్దాం
Published Mon, Nov 24 2014 2:11 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
టీమిండియా హెడ్ కోచ్ పదవిపై హర్భజన్ ఆసక్తి..?
రాహుల్ విరామం తీసుకోవడమే మేలు: పీకే
కమల్ హాసన్ ఇండియన్-2.. ప్రోమో వచ్చేసింది!
SRH: అతడి లాగే నన్నూ ఆశీర్వదించండి: అభిషేక్ తల్లికి అర్ష్దీప్ రిక్వెస్ట్ (ఫొటోలు)
బెంగుళూరు రేవ్ పార్టీ... టీడీపీ,సోమిరెడ్డికి ఇచ్చిపడేసిన కాకాణి
బజాజ్ ఫైనాన్స్తో చేతులు కలిపిన టాటా మోటార్స్.. ఎందుకో తెలుసా?
పచ్చ మందకు వాతలు పెట్టిన కాకాణి
మళ్లీ హానీమూన్కి వెళ్లిన రకుల్.. అనసూయ స్మైలీ పోజులు
అమెరికా ‘సాంత ఫె’లో విహారయాత్ర !
రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం!
తప్పక చదవండి
- రాహుల్ విరామం తీసుకోవడమే మేలు: పీకే
- T20 WC: అఫ్గానిస్తాన్ బౌలింగ్ కన్సల్టెంట్గా డ్వేన్ బ్రావో..
- లవ్ ఫర్ లగ్జరీ కార్ : నాగ చైతన్య కొత్త కారు, ధర తెలిస్తే!
- మాజీ జడ్జి గంగోపాధ్యాయ ప్రచారంపై ‘ఈసీ’ బ్యాన్
- 2030 నాటికి భారత్ 11.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలి.. లేకుంటే?
- ఎల్లో మీడియాకు చెప్పకుండా బాబు ఎక్కడికి వెళ్లారు? జోగి రమేష్
- జూన్ 1 నుంచి డ్రైవింగ్ లెసెన్స్లు జారీ చేయనున్న ప్రైవేట్ కంపెనీలు
- అంతర్జాతీయ 'టీ' దినోత్సవం! ఈ వెరై'టీ'లు ట్రై చేశారా?
- Allu Arjun: ఊహించని ప్లేసులో కనిపించిన అల్లు అర్జున్.. ఫొటో వైరల్
- బంగారం కొనుగోలు దారులకు భారీ ఊరట
Advertisement