ప్రగతినగర్ : కలెక్టరెట్లోని ప్రగతిభవన్ సమావేశ మందిరంలో శుక్రవారం సాయంత్రం నీటి సలహాబోర్డు సమావేశం జరిగింది. వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి, ఎమ్యెల్యేలు షకీల్, హన్మంత్షిండే, ఎమ్మెల్సీ అరికెల నర్సారెడి, జడ్పీ చైర్మన్ దఫేదర్ రాజ్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టులో 5.09 టీఎంసీల నీరు నిలువకు పోగా, తాగు నీటికి రెండు టీఎంసీలు కేటాయిస్తారు.
మిగితా నీటిని వృథాపోకుండా, పంటల కనుగుణంగా సమయానుసారంగా నిర్ణయం తీసుకోవడానికి కలెక్టర్కు సర్వాధికారాలు ఇస్తున్నట్లు మొదటి తీర్మానం చేశారు. అదేవిధంగా అలీసాగర్ ఎత్తిపోతల పథకం నుంచి 0.8 టీఎంసీల నీటి ని వ్యవసాయానికి విని యోగించుకునేందుకు ప్రభుత్వ అనుమతి కోరుతూ 2వ తీర్మానం, గుత్ప ఎత్తిపోతల నుంచి అవకాశం ఉన్నం త వరకు నీటిని వినియోగించుకోవడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడానికి 3వ తీర్మానం, కౌలాస్నాలా ప్రాజెక్టు నుంచి అవసరానికనుగుణంగా నీటిని విడుదల చేయడానికి కలెక్టర్కు అధికారం ఇస్తూ 4వ తీర్మానాన్ని బోర్డు ఆమోదిం చింది.
క్షేత్ర స్థాయిలో పంటను పరిశీలించాలి - మంత్రి పోచారం
అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి స్వయంగా వివరాలు సేకరించాలని, ఆదర్శరైతుల రిపోర్టులపైనే ఆధారపడడం మానుకోవాలని మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి హెచ్చరించారు. వ్యవసాయ, సహాయ వ్యవసాయాధికారులు, ఉపసంచాలకులు పంటల విస్తీర్ణాన్ని పరిశీలించాలన్నారు. వ్యవసాయ అధికారులు, నీటిపారుదల అధికారులు, రెవెన్యూ అధికారులు సమాచార సేకరణకు స్వయంగా కృషి చేయాలని మంత్రి సూచించారు. సాగు చేస్తున్న పంటలకు విద్యుత్ ఏమేరకు అందించాలో నిర్ణయించాలని, పంటలను కాపాడడానికి రైతులకు చేయూతనందించాలన్నారు.
పంటనష్టం, పంటరుణాల నిధులు ఎట్టిపరిస్థితుల్లోను దుర్వినియోగం కాకూడదన్నారు. రాష్ట్రానికి 2400 మెగావాట్ల విద్యుత్ అవసరం కాగా ప్రస్తుతం 1400 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి జరుగుతోందని, పరిశ్రమలకు కోత విధించి వ్యవసాయ పంటలు కాపాడడానికి అవసరమైన విద్యుత్ను అందిస్తామన్నారు. 2009 నుంచి 2014 వరకు
పంటనష్టం పరిహారం కింద 482.52 కోట్ల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిందని తద్వారా 26 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. జిల్లాలో 51 వేల మంది రైతులకు 20.06 కోట్ల రూపాయలను విడుదల చేశామన్నారు. జుక్కల్ శాసనసభ్యులు హన్మంత్షిండే మాట్లాడుతూ 300 క్యూసెక్కుల నీటిని నిజాంసాగర్ మండలానికి విడుదలచేయాలని కోరారు.
నియోజక వర్గంలో తీవ్ర వర్షభా వ పరిస్థితులు తట్టుకొని రైతులు వేసిన పంటలను కాపాడుకోవడానికి ఈనీరైన ఉపయోగపడుతుందన్నారు. బోధన్ ఎమ్మెల్యే షకీల్ మాట్లాడుతూ ఆద ర్శ రైతుల నుంచి వీఆర్ఓలు వారి ద్వారా వ్యవసా య అధికారులు వివరాలను సేకరించడం ద్వారా సరైన పద్ధతిలో న్యాయం జరుగడం లేదన్నారు. దీని ద్వారా అర్హులకు అన్యాయం జరుగుతుందని షకీల్ సమావేశం దృష్టికి తీసుకు వచ్చారు. ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి మాట్లాడుతూ వ్యవసాయానికి విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు ఏర్పడుతున్నం దున తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో సహకార బ్యాంకు చైర్మన్ గంగాధర్పట్వారి, నీటిపారుదల శాఖ పర్యవేక్షక ఇంజనీర్ షకీల్ ఉర్ రహమాన్, జేడీఏ నర్సింహ, ఆర్డీఓలు యాది రెడ్డి, వెంకటేశ్వర్లు, అధికారులు పాల్గొన్నారు.
కలెక్టరే నిర్ణేత
Published Sat, Aug 23 2014 3:51 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అద్భుతం.. ప్రాజెక్టు ఎక్స్పో
కోడ్ ఉల్లంఘిస్తే గట్టి చర్యలుండాలి!
రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
హిస్టరీ హెచ్ఓడీ రాజీనామా!
నిర్భయంగా ఓటు వేయాలి: సీపీ
మౌలిక సదుపాయాలు కల్పించాలి
స్వేచ్ఛగా జీవించాలంటే కాంగ్రెస్కు ఓటేయండి
సమస్యాత్మక కేంద్రాలపై దృష్టి సారించండి
కాంగ్రెస్కు ఓటమి భయం పట్టుకుంది..
ఓటర్లకు ఇబ్బందులు కలగొద్దు
తప్పక చదవండి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
Advertisement