సాక్షి, హైదరాబాద్ : అఖిల భారత సివిల్ సర్వీసు అధికారుల మధ్య అంతర్యుద్ధం ఊపందుకుంది.ఇంక్రిమెంట్ల విషయంలో ఇతర సర్వీసుల కంటే ఐఏఎస్కు ఉన్న ‘ఎడ్జ్’ ఇందుకు కారణమవుతోంది. ఈ నెల మూడో వారంలో ఏడో వేతన సంఘం (సెంట్రల్ పే కమిషన్) కేంద్రం ఆధీనంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీఓపీటీ)కి నివేదిక సమర్పించనునున్న నేపథ్యంలో ఐఏఎస్తో పాటు ఇతర సర్వీసు అధికారులు తమ డిమాండ్లు, ప్రాదమ్యాలను వివరిస్తూ లేఖలు రాస్తున్నారు.
ఇందులో భాగంగా నగరంలో పని చేస్తున్న పలువురు ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులూ డీఓపీటీకి ఇప్పటికే లేఖలు పంపారు. యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ద్వారానే వీరందరూ ఎంపికవుతారు. అయితే కొన్నేళ్లుగా ఇతర సర్వీసుల కంటే ఐఏఎస్లకు జీతం విషయంలో రెండు ఇంక్రిమెంట్ల ‘ఎడ్జ్’ కొనసాగుతోంది. వీరు ఉద్యోగంలో చేరే సమయంలోనే ఇతర సర్వీసుల కంటే గ్రేడ్ పే రెండు ఇంక్రిమెంట్లు ఎక్కువగా ఉంటోంది.
జీతం కాదు జీవితం ముఖ్యం
రెండు ఇంక్రిమెంట్లతో ప్రారంభమయ్యే వేతన వ్యత్యాసం నాలుగేళ్లకు రూ.4 వేల నుంచి రూ.5 వేలు, 14 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకునేప్పటికి రూ.15 వేల నుంచి రూ.16 వేలు, 17 ఏళ్లకు రూ.18 వేల నుంచి రూ.20 వేలకు చేరుతోంది. అయితే ఈ జీతం విషయంలో అభ్యంతరం లేదంటున్న ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులు... గ్రేడ్పే వ్యత్యాసం కారణంగా ఉన్నత స్థాయి పోస్టుల్లో నియామకాలు కోల్పోతున్నట్లు చెబుతున్నారు.
ప్రస్తుత నిబంధనల ప్రకారం కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖల్లో అత్యున్నత పోస్టులైన సెక్రటరీ, అదనపు సెక్రటరీ, సంయుక్త సెక్రటరీలుగా నియామకాలకు అఖిల భారత సర్వీసు అధికారులందరూ అర్హులే. అయితే ఆయా పోస్టుల నియామక సమయంలో సీరియారిటీతో పాటు నిర్ణీత గ్రేడ్పే ఉండాలని స్పష్టం చేస్తోంది. ఫలితంగా ‘ఎడ్జ్’ ద్వారా అధిక గ్రేడ్ పే పొందుతున్న ఐఏఎస్లకు మాత్రమే ఆయా పోస్టులు వస్తున్నాయని, దీనిపైనే తాము అభ్యంతరం చెబుతున్నట్లు ఇతర సర్వీసు అధికారులు పేర్కొంటున్నారు.
ముదిరిన ‘సివిల్’ వార్!
Published Thu, Nov 5 2015 2:59 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement