చిన్నారులపై చిన్న చూపేలా? | Child Rights Commission on Child deaths | Sakshi
Sakshi News home page

చిన్నారులపై చిన్న చూపేలా?

Jul 20 2019 2:48 AM | Updated on Jul 20 2019 2:48 AM

Child Rights Commission on Child deaths - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలు, చెత్తకుప్పల్లో, ముళ్లపొదల్లో దొరికిన పిల్లలు, లైంగిక దాడులకు గురైన చిన్నారులకు కుటుంబ వాతావరణం కల్పించి వారి బాగోగులు చూడాల్సిన శిశు విహర్‌ కేంద్రాలు ఆ దిశగా పనిచేయడం లేదని బాలల హక్కుల సంఘం మండిపడింది.

ఇటీవల హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ శిశు విహార్‌ కేంద్రంలో 4 రోజుల వయసున్న నిత్య తలకు గాయమై, 9 నెలల వయసున్న సత్యశ్రీ ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌తో మృత్యువాత పడ్డారు. ఈ  ఘటనల్లో సిబ్బంది నిర్లక్ష్యం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ శిశు విహార్‌ కేంద్రంలో సిబ్బంది నిర్లక్ష్యంతోనే చిన్నారులు మృతి చెందారని, వారి మరణానికి కారణమైన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని శుక్రవారం బాలల హక్కుల సంఘం హెచ్‌ఆర్సీలో పిటిషన్‌  వేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement