రంగారెరడ్డి జిల్లా చేవెళ్ల పార్లమెంటు కేంద్రాన్ని జిల్లా కేంద్రంగా ప్రభుత్వం ప్రకటించేవరకు ఎంతటి పోరాటానికైనా సిద్ధమేనని అఖిలపక్ష సమావేశం శనివారం తీర్మానించింది.
చేవెళ్లః రంగారెరడ్డి జిల్లా చేవెళ్ల పార్లమెంటు కేంద్రాన్ని జిల్లా కేంద్రంగా ప్రభుత్వం ప్రకటించేవరకు ఎంతటి పోరాటానికైనా సిద్ధమేనని అఖిలపక్ష సమావేశం శనివారం తీర్మానించింది. చేవెళ్ల మండల కేంద్రంలోని అతిథిగృహంలో శనివారం పలు రాజకీయ పార్టీల నాయకులతో 'జిల్లా పోరాటసమితి' పేరుతో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.
దేశవ్యాప్తంగా పార్లమెంటు కేంద్రాలే జిల్లా కేంద్రాలుగా ఉన్న తరుణంలో రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ల పార్లమెంటు కేంద్రాన్ని కాదని వికారాబాద్ను ఎలా చేస్తారని వారు ప్రశ్నించారు. చేవెళ్ల జిల్లా కేంద్రానికి మద్దతు ఇస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లోని అన్ని పార్టీలను కలుపుకొని ఉద్యమం సాగించాలని నిర్ణయించారు. ఈ విషయంపై మరింత కూలంకశంగా చర్చించేందుకు రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులతో వచ్చేనెల 1 న మళ్లీ సమావేశం కావాలని నిర్ణయించారు. పార్లమెంటు కేంద్రమైన చేవెళ్లను జిల్లా కేంద్రంగా ప్రకటించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో చేవెళ్ల ఆర్డీఓ ఎంవీ.రవీంద్రనాథ్కు వినతిపత్రం సమర్పించారు.
డీసీసీ మాజీ అధ్యక్షులు పడాల వెంకటస్వామి, పోరాటసమితి అడ్హక్కమిటీ కన్వీనర్ శ్రీనివాస్గౌడ్, సీపీఐ నాయకులు కె.రామస్వామి, ఎం.ప్రభులింగం, ఎం.బాలయ్య, బీజేపీ నాయకులు దామోదర్రెడ్డి, టీడీపీ నాయకులు శర్వలింగం, ప్రభాకర్, టీఆర్ఎస్ నాయకులు బూర్ల శివలింగం, కె.పాండు, కాంగ్రెస్ నాయకులు ఎన్.మాధవరెడ్డి, కౌకుంట్ల సర్పంచ్ వెంకటనర్సింలు, మాజీ సర్పంచ్ హన్మంత్రెడ్డి, నాగరాజు, తదితరులు హాజరై జిల్లా సాధనకోసం పోరాటాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించారు.