♦ 190 బోర్లు.. 170 ఫెయిల్
♦ రంగారెడ్డి జిల్లాలో ఓ గ్రామ ప్రజల భగీరథ యత్నం
♦ రూ.లక్షలు ఖర్చు చేసి అప్పులపాలవుతున్న రైతులు
వికారాబాద్ రూరల్: పాతాళగంగను పైకి తెచ్చేందుకు రైతన్నలు చేస్తున్న భగీరథ ప్రయత్నం ఫలించడం లేదు. తిండి గింజలైనా పండించుకుందామని అప్పులు తెచ్చి వేస్తున్న బోర్లు.. రైతులను కోలుకోకుండా చేస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మండలం పులుమద్ది గ్రామంలో రైతులు ఆరు నెలలుగా 190 బోర్లు వేస్తే అందులో 170 బోర్లు పూర్తిగా ఫెయిలయ్యాయి. మరో 15 బోర్లలో అరకొర నీళ్లు పడ్డాయి. ఒక రైతును చూసి మరో రైతు బోర్లను వేసుకుంటూ వెళ్తూనే ఉన్నారు. కానీ నీళ్లు మాత్రం పడడం లేదు. వాల్టా చట్టం ప్రకారం.. బోరుకు బోరుకు మధ్య సుమారు 100 మీటర్ల దూరం ఉండాలి.. కానీ ఈ గ్రామంలోని కొన్ని ప్రాంతాల్లో 100 మీటర్ల పరిధిలోనే సుమారు 10 బోర్లు కూడా ఉన్నాయి.
గ్రామానికి చెందిన బల్జ వీరప్ప, బుచ్చమ్మల కుమారుడు మల్లేశం తన పొలంలో రూ.4 లక్షలు ఖర్చు చేసి ఏడు బోర్లు వేశాడు. వాటిల్లో కేవలం ఒక్క బోరులోంచి అరకొర నీరు వస్తోంది. ఇదే రైతు రూ.నాలుగు లక్షలు ఖర్చు చేసి బావినీ తవ్వించాడు. అయినా ఫలితం లేదు. మరో రైతు యాదవరెడ్డి తన పొలంలో ఏకంగా తొమ్మిది బోర్లు వేశాడు. కేవలం ఒక్క బోరు మాత్రమే పనిచేస్తోంది. ఇలా చెప్పుకుంటూ పోతే గ్రామానికి చెందిన బోజిరెడ్డి, ప్రభాకర్రెడ్డి, ఎర్రవల్లి భుజంగరెడ్డి, పాండురంగారెడ్డి, టి.సంజీవరెడ్డి, శ్రీనివాస్లతోపాటు చాలా మంది రైతులు వారివారి పొలాల్లో రెండు నుంచి ఐదు బోర్ల వరకు వేయించారు. వీరిలో చాలా మంది జియాలజిస్టు అభిప్రాయం తీసుకుని మరీ బోర్లు వేసిన వాళ్లే. వేస్తున్న సమయంలో కొన్ని బోర్లలో నీళ్లు పడుతున్నా.. పది నుంచి 15 రోజుల వ్యవధిలో అవి వట్టిపోతున్నాయి. యాలాల మండలం నుంచి పులుమద్దికి వచ్చిన ఓ బోరువెల్ యజమాని 15 రోజుల్లో బోర్లు వేసి సుమారు రూ.కోటి ఆదాయం సమకూర్చుకున్నాడని రైతులు తెలిపారు.
రూ.4 లక్షలు నష్టపోయాం
మా పొలంలో ఏడు బోర్లు వేసినం. ఒకే ఒక్క బోరులోంచి నీళ్లు వస్తున్నయ్. ఉన్న మూడు ఎకరాల్లో టమాటా, క్యాబేజీతోపాటు ఇతర కూరగాయల పంటలు వేసినం. నీళ్లు సరిపోక అవి ఎండుతున్నయ్. బోర్ల వేసి రూ.4 లక్షలు నష్టపోయినం. మరో నాలుగు లక్షలు పెట్టి బాయి తవ్విచ్చినం. నీళ్లు పడలే.
- బల్జ బుచ్చమ్మ, పులుమద్ది, వికారాబాద్ మండలం
ఒకర్ని చూసి మరొకరు..
మా గ్రామంలో రైతులందరూ ఒకరి తర్వాత ఒకరు బోర్లు వేయబట్టిర్రు. దగ్గరదగ్గర్నే పది, పదిహేను బోర్లు వేస్తుం డ్రు. నేను కూడా రూ.70 వేలు ఖర్చు చేసి గతంలో బోరు వేసిన. నీళ్లు పడ్డయి. ఇప్పుడు దానికి దగ్గర్లనే వేరేటోళ్లు బోర్లు వేస్తున్నరు. మా బోర్ల నీళ్లు వట్టిపోయినయ్. వారం క్రితమే డ్రిల్లింగ్ చేయించిన. కొద్దికొద్దిగా నీళ్లు వస్తున్నయ్.
- శ్రీనివాస్, పులుమద్ది, వికారాబాద్ మండలం
బోరు.. భోరు!
Published Thu, Apr 7 2016 3:59 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement