బీఈడీ విద్యార్థిని ఆత్మహత్య | BED student suicide in Asifabad | Sakshi
Sakshi News home page

బీఈడీ విద్యార్థిని ఆత్మహత్య

Mar 23 2015 9:35 PM | Updated on Nov 9 2018 4:36 PM

కాన్సర్‌తో బాధపడుతున్న ఒక విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.

ఆసిఫాబాద్(ఆదిలాబాద్ జిల్లా): కాన్సర్‌తో బాధపడుతున్న ఒక విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన సోమవారం ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్లో జరిగింది. తిర్యాణి మండల కేంద్రానికి చెందిన తిప్పరి స్రవంతి(23) ఆసిఫాబాద్‌లోని రాజేంద్రప్రసాద్ బీఈడీ కాలేజీలో చదువుతోంది. ఆమె గత కొంతకాలంగా కాన్సర్ వ్యాధితో బాధపడుతున్నట్లు సమాచారం.

ఈ క్రమంలోనే సోమవారం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement