జీవితంపై విరక్తి చెందిన ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.
నల్లగొండ: జీవితంపై విరక్తి చెందిన ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో శనివారం జరిగింది. వివరాలు ... తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన ఉప్పునూతుల రాజేశ్వరి(25) కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ క్రమంలో ఆమె శనివారం పురుగుల మంది తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు ఒక కూతురు ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
(తిరుమలగిరి)