మద్దతు ధర కోసం వాటర్ ట్యాంక్ ఎక్కాడు | A farmer reached top of water tank for mango price | Sakshi
Sakshi News home page

మద్దతు ధర కోసం వాటర్ ట్యాంక్ ఎక్కాడు

May 22 2015 11:13 AM | Updated on Sep 3 2017 2:30 AM

మద్దతు ధర లేక కడుపు మండిన ఓ మామిడి రైతు వాటర్ ట్యాంకు ఎక్కి నిరసన తెలిపాడు.

నిజామాబాద్: మద్దతు ధర లేక కడుపు మండిన ఓ మామిడి రైతు వాటర్ ట్యాంకు ఎక్కి నిరసన తెలిపాడు. ఈ ఘటన శుక్రవారం ఉదయం నిజామాబాద్ మార్కెట్ యార్డులో చోటు చేసుకుంది. ఇక్కడ ఆంచూర్ (మామిడి ఒరుగులు)కు రెండు రోజలు క్రితం వరకూ క్వింటాకు రూ.18 వేలు ధర పలుకగా, గురు, శుక్ర వారాల్లో ఇది రూ.9 వేలకు పడిపోయింది. దీంతో రైతులు ఆందోళన బాట పట్టారు. ఒక్కసారిగా ధర పడిపోవడం వెనుక వ్యాపారులు, మార్కెట్ యార్డు సిబ్బంది కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు.

ఈ నేపథ్యంలో మెదక్ జిల్లా తిమ్మాపూర్‌కు చెందిన రైతు సురేష్ శుక్రవారం ఉదయం మార్కెట్ యార్డులోని నీటి ట్యాంకు ఎక్కి నిరసన తెలిపాడు. ఆంచూర్‌కు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు రైతు సురేష్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement