తాండూరు మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో పేకాటాడుతున్న 62 మందిని అరెస్టు
రూ. 42 వేలు, 24 సెల్ఫోన్లు స్వాధీనం
తాండూరు రూరల్: తాండూరు మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో పేకాటాడుతున్న 62 మందిని అరెస్టు చేసినట్లు కరన్కోట్ ఎస్ఐ విజయ్కుమార్గౌడ్ గురువారం తెలిపారు. వివరాలు.. బుధవారం రాత్రి కార్తీక పౌర్ణమి సందర్భంగా మండలంలోని అల్లాపూర్, గౌతపూర్, గోపన్పల్లి ,సంగెంకాలన్, చెంగోల్, కరన్కోట్ గ్రామాల్లో పేకాటాడుతున్నారనే సమాచారంతో పోలీసులు దాడి చేశారు. ఈక్రమంలో 62 మందిని అరెస్టు చేసి రూ.42 వేలు, 24 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు.
మరో ఘటనలో ఎనిమిది మంది..
పెద్దేముల్: పోలీసులు ఎనిమిది మంది జూదరులను అరెస్టు చేశారు. ఈ సంఘటన గురువారం పెద్దేముల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి పెద్దేముల్ మండల కేం ద్రంలో దుర్గా వైన్స్ పక్కన అదే గ్రామానికి చెందిన ఎనిమిది మంది పేకాటాడుతుండగా పోలీసులు దాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు.
వారి నుంచి రూ.6,830 నగదునుస్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.