ఇద్దరు చిన్నారులు అపహరణకు గురైన సంఘటన నగరంలోని ఎస్ఆర్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది.
హైదరాబాద్ సిటీ: ఇద్దరు చిన్నారులు అపహరణకు గురైన సంఘటన నగరంలోని ఎస్ఆర్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది.
ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాపునగర్ నివాసముంటున్న భవాని(7), పల్లవి(4) అనే ఇద్దరు పిల్లల్ని ఆదివారం గుర్తుతెలియని మహిళ అహరించింది. అనంతరం మాయమాటలు చెప్పి వారి ఒంటిపై ఉన్న నగలను దోచుకుని రహమత్ నగర్లో విడిచి పెట్టింది. వెంటనే రంగంలోకి దిగిన ఎస్ఆర్నగర్ పోలీసులు పిల్లల్ని వెతికి క్షేమంగా తల్లిదండ్రులు సత్యనారాయణ, సత్యవేలు వద్దకు చేర్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.