ఎయిర్‌పోర్ట్‌లో 2.7 కేజీల బంగారం పట్టివేత | 2.7 kg of gold coutch in Rajiv gandhi international airport | Sakshi
Sakshi News home page

ఎయిర్‌పోర్ట్‌లో 2.7 కేజీల బంగారం పట్టివేత

May 7 2015 11:51 PM | Updated on Mar 28 2018 11:08 AM

రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు వేర్వేరు ప్రయాణికుల నుంచి కస్టమ్స్ అధికారులు 2.7 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

శంషాబాద్ : రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు వేర్వేరు ప్రయాణికుల నుంచి కస్టమ్స్ అధికారులు 2.7 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అధికారుల కథనం ప్రకారం.. గురువారం ఉదయం బ్యాంకాక్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఓ ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. అతడి  లగేజీ నుంచి 2.3 కిలోల బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు.

 అదే సమయంలో కౌలాలంపూర్ నుంచి వచ్చిన మరో ప్రయాణికుడి లోదుస్తుల్లో 400 గ్రాముల బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement