ఆర్డీవో కార్యాలయం ఎదుట వీఆర్‌ఏల ఆందోళన | VRA protest in parvathipuram | Sakshi
Sakshi News home page

ఆర్డీవో కార్యాలయం ఎదుట వీఆర్‌ఏల ఆందోళన

Oct 25 2016 12:32 PM | Updated on Sep 4 2017 6:17 PM

ఎన్నికల హామీలను టీడీపీ ప్రభుత్వం విస్మరించిందని ఆరోపిస్తూ విజయనగరం జిల్లా పార్వతీపురంలో గ్రామ రెవెన్యూ సహాయకులు(వీఆర్‌ఏ) ఆందోళనకు దిగారు.

పార్వతీపురం: ఎన్నికల హామీలను టీడీపీ ప్రభుత్వం విస్మరించిందని ఆరోపిస్తూ విజయనగరం జిల్లా పార్వతీపురంలో గ్రామ రెవెన్యూ సహాయకులు(వీఆర్‌ఏ) ఆందోళనకు దిగారు. మంగళవారం ఉదయం వందలాది మంది వీఆర్‌ఏలు ధర్నాకు పూనుకున్నారు. ఎన్నికల హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని కోరారు. కనీసం రూ.18వేల వేతనం చెల్లించాలని, మెడికల్ ఇన్వాలిడేషన్‌లో వారసుల వయో పరిమితిని సడలించాలని కోరారు. తమను నాలుగో తరగతి ఉద్యోగులుగా పరిగణించవద్దని పేర్కొన్నారు. కార్యాలయం గేట్లు మూసేసి వారు నినాదాలు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement