గుంటూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.
బకింగ్హమ్ కెనాల్ లో ముగ్గురి గల్లంతు
Nov 21 2016 3:40 PM | Updated on Sep 4 2017 8:43 PM
తాడేపల్లి: గుంటూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని తాడేపల్లి మండలం సీఎం నివాసానికి వెళ్లే దారిలో ఉన్న బకింగ్ హమ్ కెనాల్లో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. ముగ్గురు యువకులు కెనాల్ లో చేపలు పట్టడానికి వెళ్లినట్లు తెలుస్తోంది. స్థానికలు గమనించి యువకుల కోసం గాలింపు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement


