న్యూఢిల్లీ : ఎన్నికల సమయంలో ఓటర్లను ఆకట్టుకునేవిధంగా రాజకీయ నాయకులు పంపే సామూహిక ఎస్ఎంఎస్లను ఎన్నికల తేదీకి 48 గంటల ముందు నుంచి నిలిపివేయాలని మొబైల్ సర్వీస్ కంపెనీలకు ఎలక్షన్ కమిషన్ శుక్రవారం ఆదేశించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి వ్యతిరేకంగా ఓటర్లను వివిధ పార్టీలు ఎస్ఎంఎస్ల ద్వారా ప్రలోభపెట్టకుండా ఈసీ దృష్టి సారించనుంది. ఒకవేళ ఏ పార్టీలేదా పార్టీ అభ్యర్థి సామూహిక ఎస్ఎంఎస్ల కోసం సంప్రదిస్తే వారి వివరాలను తమకు అందించాలని మొబైల్ ఆపరేటర్లకు ఈసీ ఆదేశించింది. ఈ విషయమై శుక్రవారం అన్ని మొబైల్ ఆపరేటర్లతో ఈసీ సమావేశం నిర్వహిం చింది. ఈ సందర్భంగా ఢిల్లీ ముఖ్య ఎన్నికల అధికారి విజయ్దేవ్ మాట్లాడుతూ పోలింగ్కు ముందు 48 గంటలలోపు రాజకీయపార్టీలు ఓటర్లకు సామూహిక ఎస్ఎంఎస్లను పంపాలని కోరితే నిరాకరించాలని మొబైల్ సర్వీస్ ఆపరేటర్లకు సూచించామన్నారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించకుండా చూడాల్సిన బాధ్యత అధికారుల ఉందని ప్రత్యేక ముఖ్య ఎన్నికల అధికారి షుర్బిర్ సింగ్ తెలిపారు. అలాగే సరైన పరిశీలన లేకుండా ఎవరికీ సిమ్కార్డులను జారీ చేయొద్దని మొబైల్ సర్వీస్ ప్రతినిధులను కోరామన్నారు. ఎన్నికల ముందు సిమ్కార్డుల కొనుగోళ్లు గణనీయంగా పెరి గినట్లు తమ దృష్టికి వచ్చిందని, నకిలీ ధ్రువీకరణ పత్రాలతో సిమ్కార్డులు తీసుకునేవారు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే అవకాశాలుంటాయని ఆయన విశ్లేషించారు. దీన్ని నివారించేందుకు ముందే యాక్టివేట్ చేసిన సిమ్కార్డుల అమ్మకాలను నిలిపివేయాలని చెప్పారు. సిమ్కార్డులతో ఎటువంటి సమస్య ఎదురైనా డీలరుపైనే కాకుండా సదరు కంపెనీపైనా కూడా చర్యలు తీసుకుంటామని ఈసీ అధికారులు హెచ్చరించారు
పోలింగ్కు 48 గంటల ముందు రాజకీయ ఎస్ఎంఎస్లు బంద్ ఎన్నికల కమిషన్
Published Sat, Nov 9 2013 12:29 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బ్లూ ఎకానమీలో ఆంధ్రప్రదేశ్ హవా.. ఎగుమతుల్లో సరికొత్త రికార్డ్
ఖరీదైన కారులో వడా పావ్ : ఢిల్లీ ‘కుమారాంటీ’ మరో సంచలనం
‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
ప్రశాంతంగా నీట్
కొత్త గనుల ఏర్పాటుకు కృషి చేయాలి
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
అ‘పూర్వ’ం.. ఆత్మీయం
కొడుకులు చూస్తుండగానే పోయిన ప్రాణాలు
నిప్పుల కొలిమి..
బీజేపీ అధికారంలోకి వస్తే భవిష్యత్ అంధకారం
తప్పక చదవండి
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- మెట్ గాలా 2024: అలియా టూ అంబికా మోదీ మెరిసిన బ్యూటీస్ (పోటోలు)
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement