అడుగడుగునా భయం భయం..! | People Fear on Walk Old Wooden Bridge in Odisha | Sakshi
Sakshi News home page

అడుగడుగునా భయం భయం..!

Jul 13 2020 10:05 AM | Updated on Jul 13 2020 10:05 AM

People Fear on Walk Old Wooden Bridge in Odisha - Sakshi

వంతెనపై నుంచి మోటారుబైక్‌ను దాటిస్తున్న దృశ్యం ,భయం భయంతో వంతెన దాటుతున్న ప్రజలు

ఒడిశా, భువనేశ్వర్‌/పూరీ: పూరీ జిల్లాలోని బ్రహ్మగిరి సమితి బల్లిఘాట్‌ బిందైబొస్తొ గ్రామస్తుల నిత్య జీవితం ఇలా అడుగడుగునా భయం భయంతో సాగుతోంది. ఏ చిన్నపాటి అవసరం తీర్చుకోవాలన్నా.. ఈ గెడ్డను దాటి, అవతలి ఒడ్డున ఉన్న పూరీ పట్టణం పోవాల్సిందే. ఈ క్రమంలో గెడ్డపై తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కర్రల వంతెనపైనుంచే ఇక్కడి వారంతా రోజువారీ రాకపోకలు సాగిస్తుంటారు. అయితే ఇది ప్రస్తుతం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో ఎప్పుడు ఏ క్షణంలో కూలిపోతోందోనని పాదచారులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. నడిచే క్రమంలో వంతెనపై ఉన్న ఏ చిన్న బల్ల కానీ కర్ర కానీ జారినా అక్కడి గెడ్డలో పడిపోవాల్సిందే. ఈ విషయంపై పలుమార్లు అధికారులు, నేతలను కలిసి, శాశ్వత వంతెన ఏర్పాటు చేయాలని కోరినా ఫలితం లేదని బాధిత గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, వంతెన నిర్మాణానికి చొరవ చూపాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement