కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్యకు శనివారం తృటిలో ప్రమాదం తప్పింది.
బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్యకు శనివారం తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్లో పొగలు వెలువడ్డాయి. ఈ విషయాన్ని గమనించిన పైలెట్ చాకచక్యంగా వ్యవహరించటంతో పెను ప్రమాదం తప్పింది. సిద్ధారామయ్య బెంగళూరు నుంచి మైసూరు వెళుతుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆయనతో పాటు హెలికాప్టర్లో పౌరసరఫరాల మంత్రితో పాటు అధికారులు ఉన్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.