ఢిల్లీ వాసుల్ని ఆకర్షించిన అమ్మ క్యాంటిన్ | Jayalalithaa's Amma Canteen warms cold Delhi's Pongal | Sakshi
Sakshi News home page

ఢిల్లీ వాసుల్ని ఆకర్షించిన అమ్మ క్యాంటిన్

Jan 13 2014 11:30 AM | Updated on May 28 2018 4:09 PM

ఢిల్లీ వాసుల్ని ఆకర్షించిన అమ్మ క్యాంటిన్ - Sakshi

ఢిల్లీ వాసుల్ని ఆకర్షించిన అమ్మ క్యాంటిన్

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 'అమ్మ క్యాంటీన్' దేశ రాజధానిలో అందుబాటుకి వచ్చింది

న్యూఢిల్లీ : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 'అమ్మ క్యాంటీన్' దేశ రాజధానిలో అందుబాటుకి వచ్చింది. తమిళనాడు భవన్లో  'అమ్మ క్యాంటిన్'లో ఒక్కరూపాయికే ఇడ్లీలు లభ్యమయ్యే విధంగా ఏర్పాట్లు చేశారు. పొంగల్ పర్వదినం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిన్న  ప్రారంభించారు.

దీనితో పాటు లెమన్ రైస్ , సాంబార్ రైస్ అయిదు రూపాయలకు దొరుకుతోంది. దాంతో ఢిల్లీ వాసులు అమ్మ క్యాంటిన్లో పొంగల్ వేడుకలు జరుపుకుంటున్నారు. అమ్మ క్యాంటిన్ ధరలు ఆకర్షించటంతో...వారు పెద్ద ఎత్తున తమిళనాడు భవన్కు చేరుకుని పొంగల్, ఇడ్లీ రుచి చూస్తున్నారు. కాగా కేవలం మూడు రోజుల మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement