'బాబు దళితులను బెదిరిస్తున్నారు' | former central minister panabaka lakshmi slams cm chandrababu over Dalits threats | Sakshi
Sakshi News home page

'బాబు దళితులను బెదిరిస్తున్నారు'

Nov 24 2016 7:57 PM | Updated on Aug 28 2018 7:24 PM

'బాబు దళితులను బెదిరిస్తున్నారు' - Sakshi

'బాబు దళితులను బెదిరిస్తున్నారు'

సీఎం చంద్రబాబు దళితులను బెదిరిస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి ఆరోపించారు.

అమరావతి : ప్రభుత్వం నిర్వహించే సభలు, సమావేశాలకు హాజరుకాకపోతే అభివృద్ధి ఫలాలు అందవంటూ దళితులను సీఎం చంద్రబాబు బెదిరిస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి ఆరోపించారు.

గురువారం విజయవాడ ఆంధ్రరత్న భవన్‌లో ఆమె విలేకరులతో మాట్లాడారు. అధికార పార్టీ కార్యక్రమాలకు రాని వారికి అభివృద్ధి పథకాలను అందకుండా చేయటం ద్వారా వారిని భయపెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ.. దళితుల సంక్షేమాన్ని, వారి అభివృద్ధిని విస్మరిస్తున్నాయని పనబాక లక్ష్మి అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement