54 ఏళ్ల తరువాత..మరోసారి మహిళ | Election results 2014: New Delhi Lok Sabha seat won by woman candidate after 54 years | Sakshi
Sakshi News home page

54 ఏళ్ల తరువాత..మరోసారి మహిళ

May 18 2014 11:21 PM | Updated on Sep 2 2017 7:31 AM

దాదాపు 54 ఏళ్ల తరువాత న్యూఢిల్లీ లోక్‌సభ స్థానంలో మహిళా అభ్యర్థి ఎంపీగా ఎన్నికయ్యారు. ఈసారి ఎన్నికల్లో ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థి మీనాక్షి లేఖి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు

 న్యూఢిల్లీ: దాదాపు 54 ఏళ్ల తరువాత న్యూఢిల్లీ లోక్‌సభ స్థానంలో మహిళా అభ్యర్థి ఎంపీగా ఎన్నికయ్యారు. ఈసారి ఎన్నికల్లో ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థి మీనాక్షి లేఖి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అజయ్‌మాకెన్‌ను ఓడించడం తెలిసిందే. న్యూఢిల్లీ ఎంపీగా 54 ఏళ్ల క్రితం స్వాతంత్య్ర సమరయోధురాలు సుచేతా కృపలానీ ఎంపీగా వ్యవహరించారు. ఆమె 1952-1957 మధ్యకాలంలో న్యూఢిల్లీ ఎంపీగా పనిచేశారు. అప్పటి నుంచి 2014 వరకు పురుష ఎంపీలే ఇక్కడ పనిచేశారు. మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్‌పేయి కూడా 1977లో న్యూఢిల్లీ ఎంపీగా జనతాపార్టీ టికెట్‌తో ఎన్నికయ్యారు. 1980లో మాత్రం బీజేపీ టికెట్‌తో మళ్లీ ఇక్కడి నుంచే ఎంపీగా గెలిచారు. తదనంతరం ఎల్‌కే అద్వానీతోపాటు బీజేపీ, కాంగ్రెస్ నేతలు న్యూఢిల్లీ ఎంపీలుగా ఎన్నికయ్యారు. 54 ఏళ్ల తరువాత న్యూఢిల్లీ మహిళా ఎంపీగా వ్యవహరించనున్న లేఖికి ఈసారి 4.53 లక్షల ఓట్లు పడ్డాయి. ఈమె సమీప ప్రత్యర్థి ఆశిష్ ఖేతాన్‌కు 2.90 లక్షల ఓట్లు పోలయ్యాయి. అజయ్ మాకెన్ 1.82 లక్షల ఓట్లతో సరిపెట్టుకున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement