కూరగాయల ముసుగులో డ్రగ్స్ విక్రయం | drugs gang busted in nizampet | Sakshi
Sakshi News home page

కూరగాయల ముసుగులో డ్రగ్స్ విక్రయం

Oct 1 2016 12:27 PM | Updated on May 25 2018 2:29 PM

కూరగాయల ముసుగులో డ్రగ్స్ విక్రయం - Sakshi

కూరగాయల ముసుగులో డ్రగ్స్ విక్రయం

కూరగాయల ముసుగులో డ్రగ్స్ విక్రయిస్తున్న మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్: నిజాంపేటలో కూరగాయల ముసుగులో డ్రగ్స్ విక్రయిస్తున్న వారిని దుండిగల్ పోలీసులు పట్టుకున్నారు. స్థానిక రాజీవ్‌గాంధీ నగర్‌లో కూరగాయల వ్యాపారం చేస్తున్న కొందరి ఇళ్లపై శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత పోలీసులు దాడులు చేశారు. ఈ సందర్భంగా ముగ్గురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

వారి నుంచి 4 బ్యాగుల డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరు మత్తు పదార్థాలను దొంగచాటుగా కొనుగోలు చేసి, వాటిని విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడులు నిర్వహించారు. నిందితులను పోలీస్ స్టేషన్కు తరలించి విచారిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement