తల్లి చనిపోయిందని.. | Depressed over mother's death, Gurgaon woman | Sakshi
Sakshi News home page

తల్లి చనిపోయిందని..

Nov 8 2014 11:39 PM | Updated on Nov 6 2018 7:56 PM

ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తల్లి మృతి చెందడంతో ఆందోళనకు గురై కూతురు అదే ఆస్పత్రి భవనం పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.

ఆస్పత్రి 15వ అంతస్తు నుంచి దూకి కూతురి ఆత్మహత్య
 గుర్గావ్: ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తల్లి మృతి చెందడంతో ఆందోళనకు గురై కూతురు అదే ఆస్పత్రి భవనం పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన శనివారం సెక్టార్ - 38లో చోటు చేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. గజియాబాద్ జిల్లా మురద్‌నగర్ ప్రాంతానికి చెందిన నేహగుప్తా తనతల్లి సునీతా గుప్తాను(గుండె జబ్బు) చికిత్స నిమిత్త మెదాంతా-ది మెడిసిట్ ఆస్పత్రిలో  అక్టోబర్ 18వ తేదీన చేర్పించింది. పరిస్థితి విషమించడంతో శనివారం మధ్యాహ్నం మృతి చెందిందినట్లు సదర్ పోలీస్‌స్టేషన్ అధికారి విజయ్‌కుమార్ చెప్పారు.   సైన్స్ పోస్టుగ్రాడ్యుయేట్ నెహ తల్లి మృతి తట్టుకోలేక మానసిక ఆందోళనకు గురై మిగతా కుటుంబ సభ్యుల కళ్లెదుటే, అదే ఆస్పత్రి 15వ అంతస్తు నుంచి కిందికి దూకి అక్కడికక్కడే మృతి చెందింది. సంఘటన స్థలంలో ఎలాంటి మరణ వాంజ్మూలం లభించలేదు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement