ఆర్మీకి హ్యాట్సాఫ్.. | Defense experts praise Indian Army's action in LoC | Sakshi
Sakshi News home page

ఆర్మీకి హ్యాట్సాఫ్..

Sep 30 2016 2:42 AM | Updated on Sep 4 2017 3:31 PM

ఆర్మీకి హ్యాట్సాఫ్..

ఆర్మీకి హ్యాట్సాఫ్..

నియంత్రణ రేఖ ఆవల ఉగ్ర శిబిరాలపై దాడిచేసిన భారత సైన్యంపై ప్రశంసల జల్లు కురిసింది.

నియంత్రణ రేఖ ఆవల ఉగ్ర శిబిరాలపై దాడిచేసిన భారత సైన్యంపై ప్రశంసల జల్లు కురిసింది. పార్టీలకు అతీతంగా ప్రముఖులంతా సైనిక చర్యను స్వాగతించారు. సామాజిక మాధ్యమాల్లో కూడా హర్షం వ్యక్తమైంది.

 ఇది తగిన బదులు: సోనియా
పాకిస్తాన్‌కు గట్టి సమాధానమిచ్చారు. ఉగ్ర వ్యతిరేక పోరులో ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు ఉంటుం ది. సరిహద్దుల్లో  భారత్‌పై జరుగుతున్న  దాడులకు పాకిస్తాన్ బాధ్యత వహించాలి. 

 శాంతికి కలిసి రావాలి: వెంకయ్య
ఉగ్రవాదులతో అంటకాగడాన్ని మానుకోవాలని పాకిస్తాన్‌ను ఏనాటి నుంచో అభ్యర్థిస్తున్నాం. ఆ దేశ ప్రాయోజిత ఉగ్రవాదం కేవలం భారత్‌కే కాదు మొత్తం ప్రపంచానికే ముప్పుగా మారింది. ఇరు దేశాలు కలిసి కృషి చేస్తేనే శాంతి సాధ్యం. పాక్ ఇకనైనా తన బాధ్యతను గ్రహించాలి.

ముందు జాగ్రత్త చర్య: జైట్లీ
చొరబాట్లకు సిద్ధంగా ఉన్న ఉగ్రవాదులపై సైనిక దాడి ముందు జాగ్రత్త చర్య. సైన్యం సాహసాల పట్ల గర్విస్తున్నాం.

మన శౌర్యానికి ప్రతీక: అమిత్‌షా
ఎల్‌ఓసీ ఆవల తీవ్రవాద స్థావరాలపై దాడులు ప్రధాని మోదీ నాయకత్వానికి, మన సైన్యం శౌర్యానికి ప్రతీకగా నిలుస్తాయి. ఉగ్రవాదులను ఓడించడం ద్వారా మోదీ ప్రభుత్వంలో ప్రజలు భద్రంగా ఉన్నారని భావిస్తున్నారు.

తప్పనిసరి అడుగు: జవదేకర్
ఈ దాడులు అత్యవసరమైన చర్య. ఎన్నో ఏళ్లు గా ఈ దిశగా అడుగులు పడలేదు. దేశమంతా ఈ చర్యను స్వాగతిస్తోంది. సింధూ నదీ జలాలపై కూడా ఏదో నిర్ణయం తీసుకోవాలి

చివరి అవకాశంగానే: రవిశంకర్‌ప్రసాద్
తమ గడ్డపై ఉగ్రవాదాన్ని నిర్మూలించాలని ఎన్నో ఏళ్లుగా పాకిస్తాన్‌కు చెబుతున్నా ప్రయోజనం లేకే తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ దాడులు చేయాల్సి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement