ప్రిన్సిపాల్ హత్య కేసులో సీఐడీకి హైకోర్టు చీవాట్లు | Bombay High Court raps CID on failure to finish probe in Solapur murder case | Sakshi
Sakshi News home page

ప్రిన్సిపాల్ హత్య కేసులో సీఐడీకి హైకోర్టు చీవాట్లు

Oct 19 2013 12:00 AM | Updated on Aug 11 2018 8:21 PM

సోలాపూర్‌లో ఒక కళాశాల ప్రిన్సిపల్ హత్యకేసు సాక్ష్యాల సేకరణలో సీఐడీ విఫలమైనందుకు హైకోర్టు తప్పుపట్టింది.

 ముంబై: సోలాపూర్‌లో ఒక కళాశాల ప్రిన్సిపల్ హత్యకేసు సాక్ష్యాల సేకరణలో సీఐడీ విఫలమైనందుకు హైకోర్టు తప్పుపట్టింది. 2010 లో సోలాపూర్‌కు చెందిన శోభంత్‌రావ్ జపాటే కళాశాల ప్రిన్సిపాల్ మహేష్‌ను ఇనుపరాడ్లతో కొట్టి హత్య చేసిన విషయం తెలిసిందే. కాగా, ఈ కేసును విచారిస్తున్న సీఐడీ ఇప్పటివరకు సాక్ష్యాల సేకరణలో ఎటువంటి పురోగతి సాధించలేదు. దీనిపై ఫిర్యాదుదారు, హతుడి భార్య రూపాలి కోర్టును ఆశ్రయించింది. నిందితుల ప్రలోభాలకు లొంగి తన భర్త హత్యకేసును సీఐడీ తగిన విధంగా విచారించడంలేదని, వెంటనే కేసును సీబీఐకి అప్పగించాలని ఆమె కోర్టును కోరింది. కాగా ఈ పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. ‘ఈ కేసులో పూర్తిస్థాయి వివరాలు సేకరించేందుకు సీఐడీకి ఇదే చివరి అవకాశం.. మీకు చేతకాకపోతే చెప్పండి.. సీబీఐకి కేసును అప్పగిస్తాం..’ అని సీఐడీ పుణే ఇన్‌స్పెక్టర్ జనరల్‌ను హెచ్చరించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement