ప్రేమ పెళ్లి చేసుకున్న అపురూప జంట

Blind Couple Love Marriage in Karnataka - Sakshi

కర్ణాటక, యశవంతపుర :  చూపు లేకుండా చేసి విధి వింత నాటకం ఆడినా, ఇద్దరూ ఒక్కటై కొత్త జీవితానికి శ్రీకారం చుట్టారు. బెంగళూరుకు చెందిన ఒక అంధజంట ప్రేమ పెళ్లి చేసుకుంది. వివరాలు... నగరానికి చెందిన వధువు తారాబాయి అనాథ అంధ యువతి. ఒక గార్మెంట్స్‌లో పనిచేస్తోంది. మారుతి బసప్ప సంగీత ఉపాధ్యాయుడు. ఓ వేడుకలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. దీంతో రిసోర్స్‌ సెంటర్‌కు చెందిన మేఘనా ఆదివారం వీరి వివాహాన్ని ఘనంగా జరిపించారు. నగరానికి పలువురు ప్రముఖలు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top