50 వేల కోట్ల బ్లాక్మనీ! | Black money disclosure at Rs 65000 crore till 8.00 pm | Sakshi
Sakshi News home page

50 వేల కోట్ల బ్లాక్మనీ!

Oct 1 2016 3:36 AM | Updated on Apr 3 2019 5:16 PM

50 వేల కోట్ల బ్లాక్మనీ! - Sakshi

50 వేల కోట్ల బ్లాక్మనీ!

స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం గడువు శుక్రవారంతో ముగిసింది.

న్యూఢిల్లీ: స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం గడువు శుక్రవారంతో ముగిసింది. చివరిరోజు కావడంతో అనేక మంది పెద్దఎత్తున తమ బ్లాక్‌మనీని వెల్లడించారు. మొత్తమ్మీద దేశవ్యాప్తంగా రూ.40 వేల కోట్ల నుంచి రూ.50 వేల కోట్ల నల్లధనం వెలుగుచూసే అవకాశం ఉన్నట్లు సీబీడీటీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చివరిరోజున ఢిల్లీలోని ఐటీ కార్యాలయాలైన సెంట్రల్ రెవెన్యూ బిల్డింగ్, సివిక్ సెంటర్లకు పలువురు లాయర్లు, చార్టెడ్ అకౌంటెంట్లు వచ్చారు. వారి సంస్థలు, యజమానుల తాలూకు నల్లధనం వివరాలను కార్యాలయాల్లో అందించారు.

Advertisement
 
Advertisement
Advertisement