కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థిని గర్భం దాల్చిన సంఘటన సంచలనం సృష్టించింది.
గర్భం దాల్చిన గురుకుల విద్యార్థిని
Dec 6 2016 4:25 PM | Updated on Sep 4 2017 10:04 PM
ఆళ్లగడ్డ: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో గురుకుల పాఠశాలకు చెందిన ఒక విద్యార్థిని గర్భం దాల్చిన సంఘటన సంచలనం సృష్టించింది. అనారోగ్యంతో బాధపడుతున్న టెన్త్ విద్యార్థినిని మంగళవారం స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆమె ఐదు నెలల గర్భిణిని అని వైద్యులు చెప్పారు. దీంతో విషయం తల్లిదండ్రులకు తెలియడంతో ఆందోళనకు గురయ్యారు. విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement