ఆదిలాబాద్ జిల్లా మందమర్రి శివారులోని సోనియా దాబా వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో భార్య మృతిచెందగా, భర్త, కుమార్తె తీవ్రంగా గాయపడ్డారు.
రోడ్డు ప్రమాదంలో భార్య మృతి
Mar 15 2017 2:44 PM | Updated on Aug 30 2018 4:10 PM
- భర్త, కుమార్తె పరిస్థితి విషమం
మందమర్రి: ఆదిలాబాద్ జిల్లా మందమర్రి శివారులోని సోనియా దాబా వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో భార్య మృతిచెందగా, భర్త, కుమార్తె తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. కుమార్తెతో పాటు దంపతులు ద్విచక్రవాహనంపై వెళుతుండగా లారీని ఓవర్టేక్ చేయబోయి ఎదురుగా ఆటోను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో భార్య కృష్ణవేణి అక్కడికక్కడే మృతిచెందగా, ఆమె భర్త, కుమార్తె తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.
Advertisement
Advertisement