విరాట్‌ కోహ్లికి అరుదైన గౌరవం | Virat Kohli rare honor | Sakshi
Sakshi News home page

విరాట్‌ కోహ్లికి అరుదైన గౌరవం

Dec 28 2016 12:10 AM | Updated on Sep 4 2017 11:44 PM

విరాట్‌ కోహ్లికి అరుదైన గౌరవం

విరాట్‌ కోహ్లికి అరుదైన గౌరవం

క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) నుంచి భారత టెస్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అరుదైన గౌరవం దక్కించుకున్నాడు.

సీఏ వన్డే జట్టు కెప్టెన్‌గా ఎంపిక  

మెల్‌బోర్న్‌: క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) నుంచి భారత టెస్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అరుదైన గౌరవం దక్కించుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ ఆటగాళ్లతో సీఏ ఎంపిక చేసిన వన్డే జట్టుకు కోహ్లిని కెప్టెన్‌గా ఎన్నుకున్నారు. అలాగే ఈ జట్టులో భారత్‌ నుంచి యువ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా కూడా ఉండడం విశేషం. ఇటీవలే కోహ్లి ఐసీసీ వన్డే జట్టుకు కూడా నాయకుడిగా ఎంపికైన విషయం తెలిసిందే. ‘కోహ్లి 2016లో కేవలం 10 వన్డేలు మాత్రమే ఆడాడు.

అయితే ఈ పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో తను ఉత్తమ ఆటగాళ్లలో ఒకడు. ఈ పది ఇన్నింగ్స్‌లో ఎనిమిది సార్లు 45 అంతకుంటే ఎక్కువ పరుగులు సాధించాడు. ఇందులో వరుసగా రెండు సెంచరీలున్నాయి’ అని సీఏ తెలిపింది. ఇక బుమ్రా ఈ ఏడాదే అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టగా ఎనిమిది వన్డేల్లో 17 వికెట్లు తీశాడు. ఈ జట్టులో ఆసీస్‌ నుంచి ఐదుగురు ఆటగాళ్లున్నారు.

జట్టు: కోహ్లి (కెప్టెన్‌), బుమ్రా (భారత్‌), స్మిత్, వార్నర్, మిషెల్‌ మార్‌‡్ష, హేస్టింగ్స్, స్టార్క్‌ (ఆస్ట్రేలియా), డి కాక్‌ (కీపర్‌), తాహిర్‌ (దక్షిణాఫ్రికా), బట్లర్‌ (ఇంగ్లండ్‌), బాబర్‌ ఆజమ్‌ (పాకిస్తాన్‌).
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement