భారత్ ఫైనల్ ఆశలు సజీవం | Sakshi
Sakshi News home page

భారత్ ఫైనల్ ఆశలు సజీవం

Published Fri, Jan 23 2015 5:27 PM

ధోని, కోహ్లి(ఫైల్)

హొబర్ట్: ముక్కోణపు వన్డే సిరీస్ లో భారత్ ఫైనల్ కు వెళ్లే ఆశలు సజీవంగా ఉన్నాయి. శుక్రవారం జరిగిన నాలుగో వన్డేలో ఇంగ్లండ్ పై ఆస్ట్రేలియా విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది. ఇక ఇంగ్లండ్, భారత్ జట్లలో ఒకటి ఫైనల్ కు చేరనుంది. ఇంగ్లండ్ ఇప్పటికే ధోనిసేనపై బోనస్ పాయింట్ తో విజయం సాధించినందున ఆ జట్టుకే అవకాశం ఎక్కువ ఉంది.

అయితే టీమిండియాకు దారులు పూర్తిగా మూసుకుపోలేదు. టీమిండియా తర్వాత ఆడాల్సిన రెండో వన్డేల్లో  విజయం సాధిస్తే తుదిపోరుకు అర్హత సాధిస్తుంది. సిడ్నీలో 26న జరిగే మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. 30న పెర్త్ లో జరిగే మరో మ్యాచ్ లో ఇంగ్లండ్ తో ధోనిసేన పోటీ పడుతుంది. ఫిబ్రవరి 1న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.

Advertisement
Advertisement