నేడు అలీ సంస్మరణ సభ | Today is the commemoration of the meeting Ali | Sakshi
Sakshi News home page

నేడు అలీ సంస్మరణ సభ

Jun 10 2016 12:06 AM | Updated on Sep 4 2017 2:05 AM

బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ సంస్మరణ సభలో పాల్గొనేందుకు అభిమానులు పోటీపడ్డారు.

లూయిస్‌విల్లే: బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ సంస్మరణ సభలో పాల్గొనేందుకు అభిమానులు పోటీపడ్డారు. శుక్రవారం జరిగే మెమోరియల్ టిక్కెట్ల కోసం తెల్లవారుజాము నుంచే క్యూలో నిల్చున్నారు.  ఈ కార్యక్రమానికి నిర్వాహకులు 15 వేల  టిక్కెట్లను పంపిణీ చేశారు.

తన మరణానంతరం జరిగే సంస్మరణ సభకు అభిమానులను ఉచితంగానే ఆహ్వానించాలని అలీ  చెప్పినట్టు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. సభలో అమెరికా మాజీ అధ్యక్షుడు  క్లింటన్, కమెడియన్ క్రిస్టల్ ఉపన్యసిస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement