వరుసగా ఆరో ఓటమి..! | New Zealand beats West Indies by 47 runs in 1st t20 | Sakshi
Sakshi News home page

వరుసగా ఆరో ఓటమి..!

Dec 29 2017 11:32 AM | Updated on Dec 29 2017 11:34 AM

New Zealand beats West Indies by 47 runs in 1st t20 - Sakshi

నెల్సాన్‌:మూడు టీ 20ల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.  కివీస్‌ నిర్దేశించిన 188 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 140 పరుగులకే పరిమితమైన విండీస్‌ ఓటమి పాలైంది. విండీస్‌ ఆటగాళ్లో ఆండ్రే ఫ్లెచర్‌(27), కార్లోస్‌ బ్రాత్‌వైట్‌(21), ఆష్లే నర్స్‌(20), జెరోమ్‌ టేలర్‌(20)లు స్వల్ప స్కోర్లకే పరిమితం కావడంతో పరాజయం తప్పలేదు. కివీస్‌ బౌలర్లలో టిమ్‌ సౌతీ, సెత్‌ రాన్స్‌లు తలో మూడు వికెట్లు సాధించగా, బ్రాస్‌ వెల్‌కు రెండు వికెట్లు దక్కాయి.సాంత్నార్‌, ఇష్‌ సోథీలు  చెరో వికెట్‌ తీశారు. 

దాంతో టెస్టు, వన్డే సిరీస్‌లు గెలిచిన కివీస్‌.. టీ 20లో సైతం శుభారంభం చేసి 1-0 ఆధిక్యం సాధించింది. మరొకవైపు న్యూజిలాండ్‌ పర్యటనలో వెస్టిండీస్‌ ఇంకా బోణి కొట్టలేదు. ఇది వెస్టిండీస్‌కు వరుసగా ఆరో ఓటమి. తొలుత జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను 2-0తో కోల్పోయిన విండీస్‌.. మూడు వన్డేల సిరీస్‌లో వైట్‌ వాష్‌ అయ్యింది. తొలి టీ 20లో టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. కొలిన్‌ మున్రో(53), గ్లెన్‌ ఫిలిప్స్‌(55)లు హాఫ్‌ సెంచరీలతో రాణించి కివీస్‌ గౌరవప్రదమైన స్కోరు చేయడంలో సహకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement