► క్వాలిఫయింగ్లో నెదర్లాండ్స్పై గెలుపు
► తమీమ్ ఒంటరిపోరాటం
ధర్మశాల: టి20 ప్రపంచకప్ క్వాలిఫయింగ్ తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్ బోణీ చేసింది. తమీమ్ ఇక్బాల్ (58 బంతుల్లో 83 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో... బుధవారం జరిగిన మ్యాచ్లో బంగ్లా 8 పరుగుల స్వల్ప తేడాతో నెదర్లాండ్స్పై గెలిచింది. హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్లో... టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన బంగ్లా 20 ఓవర్లలో 7 వికెట్లకు 153 పరుగులు చేసింది. ఆరంభంలో డచ్ బౌలర్లు చెలరేగడంతో బంగ్లాకు శుభారంభం దక్కలేదు.
ఓ ఎండ్లో తమీమ్ నిలకడగా ఆడినా.. రెండో ఎండ్లో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. సౌమ్య సర్కార్ (15), షబ్బీర్ (15) కాసేపు పోరాడారు. గుగెటెన్ 3, వాన్ మీకెరెన్ 2 వికెట్లు తీశారు. తర్వాత నెదర్లాండ్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 145 పరుగులకే పరిమితమైంది. బోరెన్ (29), మైబర్గ్ (29), కూపర్ (20) ఓ మాదిరిగా ఆడారు. చివరి 12 బంతుల్లో 33 పరుగులు చేయాల్సిన దశలో డచ్ ఆటగాళ్లు బుకారి (14), పీటర్ సీలర్ (7 నాటౌట్)లు ఒకే ఓవర్లో 16 పరుగులు రాబట్టారు. అయితే తస్కిన్ వేసిన ఆఖరి ఓవర్లో 8 పరుగులు మాత్రమే రావడంతో ఓటమి తప్పలేదు. అల్ అమిన్, షకీబ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. తమీమ్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
బంగ్లాదేశ్ బోణీ
Published Thu, Mar 10 2016 12:25 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
నేడు సీఎం జగన్ ప్రచార సభలు ఇలా..
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement