కబడ్డీకి పెరిగిన ప్రేక్షకాదరణ | kabaddi viewership increased | Sakshi
Sakshi News home page

కబడ్డీకి పెరిగిన ప్రేక్షకాదరణ

Aug 16 2016 12:18 PM | Updated on Sep 4 2017 9:31 AM

కబడ్డీ కూత కొత్త రికార్డులను సృష్టిస్తోంది.

న్యూఢిల్లీ: కబడ్డీ కూత కొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఏటికేడు టీవీ వీక్షకుల సంఖ్యను అమాంతం పెంచుకుంటోంది. తాజాగా ముగిసిన నాలుగో సీజన్  కబడ్డీ లీగ్‌ను సగటున కోటి మంది వీక్షించినట్లు అంచనా. ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ -1 నుంచి సీజన్-4 ముగిసే సరికి వీక్షకుల సంఖ్య 51 శాతం పెరిగింది. పురుషులతో పాటు మహిళా కబడ్డీకి కూడా మంచి ఆదరణ లభిస్తోంది.

 

ప్రేక్షకులను మరింతగా అలరించేందుకు అక్టోబర్‌లో కబడ్డీ ప్రపంచకప్‌ను భారత్‌లో నిర్వహించనున్నారు. ఇందులో మొత్తం 12 దేశాలు తలపడతాయి. ‘ పురుషుల, మహిళల కబడ్డీకి భారత్‌లో గొప్ప ఆదరణ కనిపిస్తోంది. ఇది మంచి పరిణామం. ప్రేక్షకాదరణతో స్పాన్సర్లు కూడా ముందుకు వస్తున్నారు. ఏటికేడు స్పాన్సర్‌షిప్ పెరుగుతుండటం సంతోషకరం’ అని స్టార్ స్పోర్ట్స్ సీఈవో నితిన్ కుక్రేజా అన్నారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement